News July 25, 2024
మరణంలోనూ వీడని తల్లీకుమారుల బంధం

విధి రాతకు బలైన ఓ కుటుంబ విషాదాంతమిది. HYDలో తన భార్య, కుమారులతో కలిసి ఉంటున్న గుంజి శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. కుటుంబ పోషణ, పిల్లల కాలేజీ ఫీజులకూ డబ్బుల్లేక తల్లి గత రాత్రి ఉరి వేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పెద్ద కొడుకు వంశీ(18) క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని చూసి రెండో కుమారుడి గుండెలు పగిలాయి. ఒంటరిగా మిగిలానంటూ రోదించిన తీరు హృదయాలను కలిచివేసింది.
Similar News
News February 2, 2026
జగిత్యాలలో పొలిటికల్ వార్.. నేతల వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలలో పొలిటికల్ వార్ మొదలైంది. MLC బల్మూరి వెంకట్ శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి పోరాదని హెచ్చరించారు. అలాగే ఎంపీ అరవింద్ జగిత్యాలలో ఎన్నికల శంఖారావంలో పాల్గొని జీవన్ రెడ్డిని వేధించడం సరికాదని, అలాగే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేయడం పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచింది.
News February 2, 2026
ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ బండి పడమర వీధి నుంచి ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు ఈ రూట్మ్యాప్ను అనుసరించాలని అధికారులు సూచించారు.
News February 2, 2026
ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ బండి పడమర వీధి నుంచి ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు ఈ రూట్మ్యాప్ను అనుసరించాలని అధికారులు సూచించారు.


