News August 29, 2024

3500 ఏళ్లనాటి కూజాను పగులగొట్టిన బాలుడు.. మ్యూజియం ఏం చేసిందంటే?

image

ఇజ్రాయెల్‌లోని హెచ్ట్ మ్యూజియంలోని పురాతన వస్తువులను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బాలుడు 3500 ఏళ్ల నాటి కూజాను పగులగొట్టాడు. వస్తువులను చూసే బిజీలో తండ్రి ఉండగా ఆ బాలుడు కూజా వద్దకు వెళ్లి లాగడంతో పడి ముక్కలైంది. ఇది 2200-1500BC మధ్య కాంస్య యుగం నాటిదని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. పిల్లాడు కావాలని చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, విరిగిన వస్తువులను పునరుద్ధరిస్తామన్నారు.

Similar News

News November 19, 2025

హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

image

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.

News November 19, 2025

హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

image

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.

News November 19, 2025

స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.