News August 29, 2024

3500 ఏళ్లనాటి కూజాను పగులగొట్టిన బాలుడు.. మ్యూజియం ఏం చేసిందంటే?

image

ఇజ్రాయెల్‌లోని హెచ్ట్ మ్యూజియంలోని పురాతన వస్తువులను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బాలుడు 3500 ఏళ్ల నాటి కూజాను పగులగొట్టాడు. వస్తువులను చూసే బిజీలో తండ్రి ఉండగా ఆ బాలుడు కూజా వద్దకు వెళ్లి లాగడంతో పడి ముక్కలైంది. ఇది 2200-1500BC మధ్య కాంస్య యుగం నాటిదని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. పిల్లాడు కావాలని చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, విరిగిన వస్తువులను పునరుద్ధరిస్తామన్నారు.

Similar News

News September 16, 2025

అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

image

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్‌ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.