News August 29, 2024

3500 ఏళ్లనాటి కూజాను పగులగొట్టిన బాలుడు.. మ్యూజియం ఏం చేసిందంటే?

image

ఇజ్రాయెల్‌లోని హెచ్ట్ మ్యూజియంలోని పురాతన వస్తువులను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బాలుడు 3500 ఏళ్ల నాటి కూజాను పగులగొట్టాడు. వస్తువులను చూసే బిజీలో తండ్రి ఉండగా ఆ బాలుడు కూజా వద్దకు వెళ్లి లాగడంతో పడి ముక్కలైంది. ఇది 2200-1500BC మధ్య కాంస్య యుగం నాటిదని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. పిల్లాడు కావాలని చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, విరిగిన వస్తువులను పునరుద్ధరిస్తామన్నారు.

Similar News

News November 3, 2025

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.

News November 3, 2025

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతిలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. యాదాద్రిలోని చౌటుప్పల్‌లో 6.1cm, నిజామాబాద్‌లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.

News November 3, 2025

రోజూ శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే..

image

శివలింగానికి రోజూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అభిషేకం ఆరోగ్యంతో పాటు, బలం, యశస్సు, కీర్తిని ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ‘పెరుగు చాలా శుభప్రదమైనది. పౌష్టికపరమైనది. ఈ అభిషేకం భక్తుల శారీరక, మానసిక రోగాలను మాయం చేస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగి, మంచి వ్యక్తిత్వంతో జీవించడానికి శివానుగ్రహం లభిస్తుంది’ అంటున్నారు.