News April 10, 2024

కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు.. చివరికి..

image

AP: నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తోంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. ఈనెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకొని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలేషా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News October 16, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News October 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 37 సమాధానాలు

image

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు శ్రవణుడ్ని సంహరించాడు.
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు పరీక్షిత్తు.
3. వాయు దేవుడి వాహనం ‘జింక’.
4. విష్ణువు మత్స్య అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు.
5. నవతి అంటే తొంబై.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 16, 2025

మీనాక్షితో సురేఖ భేటీ

image

TG: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను మీనాక్షికి వివరించారు. తన ఇంటికి పోలీసులు రావడం, అక్కడ జరిగిన వివాదంపై చర్చించారు. తన కూతురు వ్యాఖ్యలపైనా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొండా సురేఖ <<18009181>>వివాదంపై<<>> ఏఐసీసీ నివేదిక అడిగిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.