News April 20, 2025
పెళ్లిపీటలపై కాబోయే అత్త.. వరుడు అవాక్కు!

యూపీలో పెళ్లిపీటలపై తనకు కాబోయే భార్యకు బదులు ఆమె తల్లి ఉండడంతో వరుడు హతాశుడయ్యాడు. మీరట్కు చెందిన అజీం(22)కు శామలీ జిల్లాకు చెందిన మంతషా(21)తో వివాహం నిశ్చయమైంది. కానీ నిఖాలో మత గురువు వధువు పేరును ‘తాహిరా’ అని పలికాడు. అనుమానం వచ్చి ముసుగు తొలగించి చూడగా మంతషాకు బదులు భర్త చనిపోయిన ఆమె తల్లి తాహిరా (45) కనిపించింది. దీంతో మోసపోయానని గ్రహించి అజీం స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
Similar News
News August 5, 2025
సినీ కార్మికుల సమ్మెను తప్పుబట్టిన విశ్వప్రసాద్

టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.
News August 5, 2025
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

AP: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన RTC అందుబాటులోకి తేనుంది. AMVTI, ATP, CUD, NLR, GNT, VJW, RJY, KKD, VSP, KRNL, TPT డిపోల నుంచి ఇవి తిరగనున్నాయి. వీటికోసం కేంద్రం అందించే రూ.190కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. ఒక్కో స్టేషన్కు రూ.4కోట్లు ఖర్చవుతుందని, డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
News August 5, 2025
సోనూసూద్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు హర్షం

తమ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.