News October 25, 2024
బడ్జెట్ రూ.45 కోట్లు.. కలెక్షన్లు రూ.50వేలు

భారీ అంచనాలతో రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక భారీ నష్టాలను మిగిలిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘ది లేడీ కిల్లర్’. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా రూ.45 కోట్ల బడ్జెట్తో అజయ్ బాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది నవంబర్లో ‘ది లేడీ కిల్లర్’ రిలీజవగా భారత సినీ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఇది కేవలం రూ.50వేలు మాత్రమే రాబట్టగలిగింది.
Similar News
News February 9, 2026
ఫలితాలకు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు: బండి

TG: సీఎం <<19093271>>రేవంత్<<>> మున్సిపల్ ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం స్క్రిప్ట్ దారుస్సలాంలో ప్రిపేర్ అవుతోందని విమర్శించారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టడం సీఎంకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము తనకు లేదని రేవంత్ లేఖ రాస్తే వాళ్ల సంగతి తాము చూసుకుంటామన్నారు.
News February 9, 2026
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ‘ఈ-ప్యాంట్రీ’ సేవలు ప్రారంభం

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి E-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో లేదా ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్, వాటర్ను ఆర్డర్ చేసుకోవచ్చు. జర్నీ రోజున సీటు వద్దకే భోజనం అందిస్తారు. ప్రస్తుతం 25 రైళ్లలో ఇది అమల్లోకి వచ్చింది. E-ప్యాంట్రీ సేవను తొలుత వివేక్ ఎక్స్ప్రెస్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.
News February 9, 2026
పల్లె కన్నీరు పెడుతోంది: కొలికపూడి

AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్తో రాజకీయ చర్చ మొదలైంది. పల్లెల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధిలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వాట్సాప్ స్టేటస్లో ‘3 రోజులు, 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు. పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల కొలికపూడి-MP కేశినేని చిన్ని మధ్య స్టేటస్ వార్ జరిగిన విషయం తెలిసిందే.


