News September 16, 2024
బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
ఎల్లుండి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్!

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో ₹900Cr చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్లైన్ నేటితో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎల్లుండి(NOV 3) నుంచి నిరవధిక బంద్కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. 2024-25 వరకు ₹9వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ముందు ₹1,200Cr రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ₹300Cr మాత్రమే చెల్లించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
News November 1, 2025
చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్

దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది.
News November 1, 2025
పేపర్, TV ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు: CBN

AP: YCP ఓ ఫేక్ పార్టీ అని CBN విమర్శించారు. ‘ఆ పార్టీకి ఏం దొరకడం లేదు. ఏ ప్రమాదం జరిగినా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపైనా దుష్ప్రచారం చేశారు. YCPకి ఓ పాంప్లెట్, ఛానెల్ ఉన్నాయి. వాటితో శవరాజకీయం చేస్తోంది. కమ్మ, కాపు మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. వీటిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే అర్హత వారికి లేదన్నారు.


