News August 7, 2024
ఇంటర్ విద్యార్థులపై తగ్గనున్న పాఠాల భారం!

TG: NCERT ప్రణాళిక అనుగుణంగా విద్యార్థులపై పాఠాల భారం తగ్గించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సబ్జెక్టుల నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025-26 నుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కెమిస్ట్రీలో 10-15% పాఠ్యాంశాలు తగ్గుతాయని, MECకి ప్రత్యేక మ్యాథ్స్ పుస్తకం, బైపీసీ సబ్జెక్టుల్లో మార్పులు జరిగే అవకాశముందని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News December 24, 2025
పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.
News December 24, 2025
గర్భనిరోధక మాత్ర ఎలా పని చేస్తుందంటే?

ఈ టాబ్లెట్లలో లెవోనోర్జెస్ట్రల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సింథటిక్ వెర్షన్. ఓవులేషన్ సమయంలో అండం విడుదల అవుతుంది. అయితే ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతుంది. అండం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అలాగే ఫలదీకరణం అయిన అండం గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.
News December 24, 2025
శని దోషమా? ఇవి దానం చేయండి..

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా శని దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు అన్నదానం, వస్త్రదానం చేయాలంటున్నారు. ‘చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంబళ్లు, దుప్పట్లు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని సరళమైన పరిహారాలతో శని బాధలను తగ్గించుకోవచ్చు’ అంటున్నారు. ఆ పరిహారాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


