News September 2, 2024

ఏపీలో భారత క్రికెటర్ల సందడి

image

అనంతపురంలో భారత క్రికెటర్ల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తుషార్ దేశ్ పాండే తదితర ప్లేయర్లు బస్సులో బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్నారు. తొలి మ్యాచ్ ఆర్టీడీ మైదానంలో 5న ఇండియా సీ, డీ జట్ల మధ్య జరగనుంది. ఆటగాళ్లకు అలెగ్జాండర్ త్రీస్టార్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు.

Similar News

News September 15, 2024

పాఠాలు మీరు చెబుతారా జగన్?: మంత్రి సత్యకుమార్

image

AP: YS జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ‘నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది కొన్ని కాలేజీలు ప్రారంభించారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు లేవు. పులివెందుల కాలేజీలో 48శాతం బోధనా సిబ్బంది లేరు. గదులు లేవు. విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలి? పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెబుతారా ప్రొఫెసర్ జగన్’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

News September 15, 2024

సంక్రాంతికి చిరంజీవిVSబాలకృష్ణ?

image

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు మరోసారి బాక్సాఫీసు వద్ద పోటీ పడే ఛాన్సుంది. వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కానుండగా, డైరెక్టర్ బాబీ, బాలయ్య కాంబోలో వస్తోన్న ‘NBK109’ను జనవరి 9కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి వీరిద్దరి మూవీస్ క్లాష్ కానున్నట్లు తెలుస్తోంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజయ్యాయి.

News September 15, 2024

టీమ్‌ఇండియాతో ఆడటం కష్టం.. కానీ: హెడ్

image

టీమ్‌ఇండియాతో మ్యాచుల్లో మంచి స్కోర్లు చేయడంపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ స్పందించారు. ‘IND బలమైన జట్టు. వారితో ఆడటం కష్టమే. కానీ మేము ఇప్పటికే వారితో చాలా మ్యాచుల్లో తలపడ్డాం. గత రెండేళ్లుగా నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. రాణిస్తుండటం బాగుంది. రాబోయే సిరీస్‌లోనూ నా టీమ్‌కు విజయాలు అందించాలని అనుకుంటున్నా’ అని చెప్పారు. 2023 WTC, ODI WC ఫైనల్స్‌లో INDపై AUS గెలుపులో హెడ్ కీలక పాత్ర పోషించారు.