News May 11, 2024

లెక్క మారుతోంది.. ఓటుకి రూ.3వేల నుంచి రూ.5వేలు!

image

AP: రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో నగదు పంపిణీ లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటికే రూ.3వేల వరకు పంపిణీ జరిగిపోయినట్లు సమాచారం. అయితే ప్రత్యర్థి పార్టీ నగదు మొత్తాన్ని పెంచడంతో అవతలి పార్టీ కూడా మరింత పెంచి ఇస్తోందట. పోటాపోటీగా సాగుతున్న పంపకాల్లో కొన్నిచోట్ల ఓటుకు రూ.5000 దాటి పోయినట్లు తెలుస్తోంది. పెంచిన మొత్తాన్ని ఇవాళ, రేపు ఓటర్లకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Similar News

News April 13, 2026

భారత నౌకలకు టోల్ తీసుకోలేదు: ఇరాన్

image

హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పటి వరకు భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయలేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్‌ తమ మిత్రదేశమని పునరుద్ఘాటించింది. భారతీయ నౌకల భద్రత, ప్రయాణ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఇండియాలోని ఆ దేశ రాయబారి ఫతాలీ తెలిపారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. హార్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న US హెచ్చరికలను కొట్టిపారేస్తూ.. ‘వారికి మా సామర్థ్యం ఏంటో తెలుసు’ అని పేర్కొన్నారు.

News April 13, 2026

పాండ్య, డేవిడ్‌లకు ఫైన్

image

IPL: ముంబై కెప్టెన్ పాండ్య, ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు జరిమానా పడింది. నిన్నటి మ్యాచులో అంపైర్ సూచనలను <<19638355>>డేవిడ్<<>> పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అడిగినా బాల్ ఇవ్వలేదని IPL యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినందుకు అతడి మ్యాచు ఫీజులో 25% కోత విధించినట్లు తెలిపింది. అటు స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసినట్లు వెల్లడించింది.

News April 13, 2026

12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA

image

AP: రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 44 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. మ.12 నుంచి సా.4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈరోజు కడపలో గరిష్ఠంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.