News July 13, 2024

లెక్క తేలింది.. పెండింగ్ బిల్లులు రూ.28 వేల కోట్లు!

image

AP: ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లులు మొత్తం రూ.28 వేల కోట్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఒక్క జలవనరుల శాఖలోనే రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా బడ్జెట్ రూపకల్పన కోసం ఈ పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపాలని ఆర్థిక శాఖ మిగతా ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ఆయా మొత్తాలకే బడ్జెట్‌లో కేటాయింపులుంటాయని స్పష్టం చేసింది.

Similar News

News October 29, 2025

APPLY NOW: ICMRలో ఉద్యోగాలు

image

ICMR-న్యూఢిల్లీ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS/MD/MS/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PWBD/EWS/మహిళలకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/

News October 29, 2025

గొర్రె, మేక పిల్లల పెంపకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.

News October 29, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు!

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.