News September 10, 2024
ఆ ఉద్యోగాల భర్తీపై ప్రచారం ఫేక్.. నమ్మొద్దు: సమగ్రశిక్ష

AP: డిగ్రీ అర్హతతో పలు ప్రభుత్వ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్ర శిక్ష అధికారులు ఖండించారు. ‘సెంట్రల్, స్టేట్ స్కూల్స్, గురుకులాలు, ఇంటర్ బోర్డులో ఉద్యోగాలు అంటూ వార్తలు వస్తున్నాయి. DIKSHA&UNICEF కౌన్సెలింగ్ సెంటర్లోనూ పోస్టుల భర్తీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దు. దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు’ అని తెలిపారు.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


