News June 28, 2024

కెప్టెన్, వైస్ కెప్టెన్ అంతా తామై..!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించారు. 139 రన్స్‌తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు.

Similar News

News September 20, 2024

బ్రాండ్ విలువలో TCS మరోసారి నంబర్-1

image

దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా TCS వరుసగా మూడో ఏడాది గుర్తింపు పొందింది. $49.7 బిలియన్ల విలువతో అగ్రస్థానంలో నిలిచినట్లు Kantar BrandZ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంక్($38.3bn), ఎయిర్‌టెల్($29.86bn), ఇన్ఫోసిస్($25.22bn), SBI($17.98bn), ICICI బ్యాంక్($15.60bn), జియో($13.74bn), ఏషియన్ పెయింట్స్($13.56bn), HCL టెక్($11.82bn), LIC($11.50bn) ఉన్నాయి.

News September 20, 2024

నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.

News September 20, 2024

DSC అభ్యర్థుల ఎదురుచూపులు.. GRL విడుదల ఆలస్యం

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల తుది ‘కీ’ ఈ నెల 6న రిలీజ్ చేయగా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(GRL) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ మార్కులకు టెట్ స్కోరును కలిపి వారంలో లిస్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ సమాచారం లేదు. జాబితా విడుదలకు మరింత ఆలస్యం కానుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. GRL ఇచ్చాక జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి మెరిట్ జాబితాను DEOలకు పంపాల్సి ఉంటుంది.