News July 26, 2024

భోజనంలో ఊరగాయ లేదని కేసు.. హోటల్‌కు రూ.35వేల ఫైన్

image

తమిళనాడులోని విల్లుపురంలో ఓ హోటల్‌ భోజనం పార్సిల్‌లో ఊరగాయ లేకపోవడంతో ఆరోఖ్యస్వామి అనే వ్యక్తి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. అన్నంతోపాటు 11 రకాల ఐటమ్స్ ఇస్తామనడంతో అతను 25 భోజనాలకు ₹2వేలు చెల్లించాడు. తీరా ఓపెన్ చేస్తే ఊరగాయ కనిపించలేదు. హోటల్ యజమాని దురుసు సమాధానం ఇవ్వడంతో అతను కేసు వేశారు. దీంతో కోర్టు ₹35వేలతోపాటు పచ్చడికి ₹25 చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

Similar News

News November 22, 2025

ఇల్లంతకుంట: ‘అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర’

image

ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ MLA సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మానకొండూర్ MLA కవ్వంపల్లి పాల్గొన్నారు. ఆయన వెంట ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.

News November 22, 2025

నట్స్‌తో బెనిఫిట్స్: వైద్యులు

image

నిత్యం స్నాక్స్‌గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్‌ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.

News November 22, 2025

రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్‌

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్‌, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్‌ ఫ్రీజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.