News November 12, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ నాయకులకు పిలుపు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలిసారి ఓ రాజకీయ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చారు. ప్రధాన నిందితుల వేటలో ఉన్న పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. వీరితో ఫోన్ సంభాషణలు జరిపిన నాయకులను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరెస్టయిన అడిషనల్ SP తిరుపతన్నతో చిరుమర్తి గతంలో మాట్లాడినట్లు గుర్తించి, నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


