News September 13, 2024

ఈ వివాదానికి రేవంతే కారణం: హరీశ్ రావు

image

TG: కౌశిక్ రెడ్డి-గాంధీ వివాదానికి ముఖ్య కారకుడు CM రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘CM బజారు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనలాగే గాంధీ, దానం వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదం రేవంత్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది’ అని మండిపడ్డారు.

Similar News

News October 26, 2025

స్టార్ క్యాంపెయినర్స్‌గా సోనియా, రాహుల్, ప్రియాంక

image

బిహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌ రిలీజ్ చేసింది. ఇందులో పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు KC వేణుగోపాల్, భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ తదితరుల పేర్లనూ చేర్చింది. NOV 6, 11 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News October 26, 2025

రేపు ఉదయం 11గంటలకు..

image

TG: మద్యం దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక లాటరీ పద్ధతిలో రేపు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహణ జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్‌లో 100 మద్యం దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌నగర్‌లో 134 మద్యం షాపులకు 7,845 అప్లికేషన్లు వచ్చాయి.

News October 26, 2025

దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

image

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.