News April 5, 2025
సన్నబియ్యం కేంద్రానివే: కిషన్ రెడ్డి

TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘6KGల బియ్యంలో 5KGలు PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం కిలో బియ్యానికి రూ.37.52ల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే ఐదుగురున్న కుటుంబానికి నెలకు రూ.938ల సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం కింద 2కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News September 13, 2025
శుభ సమయం (13-09-2025) శనివారం

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.11.17 వరకు
✒ నక్షత్రం: కృత్తిక మ.2.55 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: తె.5.47లగాయతు
✒ అమృత ఘడియలు: మ.12.40-మ.2.09
News September 13, 2025
టాలీవుడ్ సంచలనం.. తేజా సజ్జ

కలిసుందాం రా, ఇంద్ర, ఠాగూర్, గంగోత్రి తదితర సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన తేజా సజ్జ వరుస హిట్లతో అదరగొడుతున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, తాజాగా ‘మిరాయ్’ మూవీతో సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన హనుమాన్, మిరాయ్ అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తేజకు మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News September 13, 2025
TODAY HEADLINES

*మంగళగిరిలో Way2News Conclave.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
*మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: CM చంద్రబాబు
*గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తాం: సజ్జల
*ఉపరాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
*ఈనెల 15 నుంచి TGలో కాలేజీలు బంద్: FATHI
*AP లిక్కర్ కేసులో 10మంది నిందితులకు రిమాండ్ పొడిగింపు
*నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
*USలో భారతీయుడిని తల నరికి దారుణ హత్య