News February 19, 2025

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

Similar News

News February 21, 2025

బెంగళూరును మార్చడం దేవుడి వల్ల కూడా కాదు: Dy CM

image

తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి, అధిక అద్దె ధరల వంటి సమస్యలతో బెంగళూరు సతమతమవుతోంది. అయితే తమకు అధికారం ఉన్న కొన్నేళ్లలోనే బెంగళూరును బాగు చేయడం అసాధ్యమని ఆ రాష్ట్ర Dy CM డీకే శివకుమార్ అన్నారు. ‘మూడేళ్లలో ఈ నగరాన్ని మార్చడం దేవుడి వల్ల కూడా కాదు. సరైన ప్రణాళిక రచించి, దాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే అది సాధ్యం. ప్రస్తుతానికి రోడ్ల నిర్వహణపై హ్యాండ్ బుక్ విడుదల చేశాం’ అని తెలిపారు.

News February 21, 2025

నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

image

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.

News February 21, 2025

అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?

image

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం. ‘45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం.

error: Content is protected !!