News September 12, 2024
9 మంది జడ్జిలిచ్చిన తీర్పుపై రివ్యూ కోరిన కేంద్రం

మైనింగ్, మెటల్ కంపెనీలు ఆయా రాష్ట్రాలకు <<13708414>>రాయల్టీ<<>> చెల్లించాలంటూ 9 మంది జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్రం, Pvt కంపెనీలు రివ్యూ కోరాయి. తీర్పులో కొన్ని తప్పులు ఉన్నాయన్నాయి. మధ్యప్రదేశ్ కో-పిటిషనర్గా ఉంది. ఇది ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశమని, ఓపెన్ కోర్టులో విచారించాలని కేంద్రం కోరింది. ప్రజా ప్రయోజనం దాగున్న ఈ పిటిషన్ను ఓరల్ హియరింగ్కు అనుమతించకపోతే అన్యాయమే అవుతుందని పేర్కొంది.
Similar News
News January 3, 2026
భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోలు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొంటా-కిస్తారామ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 12 మంది, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మావోలను పోలీసు బలగాలు హతమార్చాయి. వీరిలో కీలక నేత సచిన్ మంగడు కూడా ఉన్నారు. దీంతో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. అడవుల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
News January 3, 2026
ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
News January 3, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో పోస్టులు

<


