News September 3, 2025

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

image

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

Similar News

News January 28, 2026

WPL: ఒకే ఓవర్లో 4, 4, 4, 4, 1, 6

image

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్(9 ఫోర్లు), స్నేహ్ రాణా(3 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. 17వ ఓవర్లో తొలి 4 బంతుల్లో నికీ ఫోర్లు బాదగా, చివరి బంతిని రాణా సిక్సర్‌గా మలిచారు. 19వ ఓవర్లో రాణా తొలి 3 బంతుల్లో 6, 4, 4 బాదారు. ఐదో బంతిని నికీ ఫోర్ కొట్టారు. కానీ చివరి ఓవర్లో తడబడి <<18979077>>మ్యాచును<<>> చేజార్చుకున్నారు.

News January 28, 2026

రూ.90వేల జీతంతో AWEILలో ఉద్యోగాలు

image

అడ్వాన్స్‌డ్ వెపన్స్& ఇక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (<>AWEIL<<>>) 14 ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 23 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, ICMAI అర్హతతో పాటు ICAI ఫెలో మెంబర్ అయి పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. సైట్: https://ddpdoo.gov.in

News January 28, 2026

ఉక్రెయిన్-రష్యా వార్.. 20L సైనికుల లాస్

image

నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనిక నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20L మంది మరణించడం లేదా గాయపడటం/బందీలవడం/మిస్సయినట్లు US థింక్ ట్యాంక్ వెల్లడించింది. ఇందులో మాస్కో ఫోర్స్ 12L, ఉక్రెయిన్ దళాలు 8L వరకు ఉన్నట్లు తెలిపింది. అయితే ఇరు దేశాలు ఈ సంఖ్యను భారీగా తగ్గించి చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో దాదాపు 15వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు UN చెబుతోంది.