News February 6, 2025
ఉపాధి కూలీలకు ₹6,434 కోట్లు బకాయి పడిన కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738802805927_1045-normal-WIFI.webp)
MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.
Similar News
News February 6, 2025
Stock Markets: పెరిగిన డిఫెన్సివ్ స్టాక్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1727691857109-normal-WIFI.webp)
స్టాక్మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. బంగారం, డాలర్ ఇండెక్స్, US బాండ్ యీల్డులు పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. నిఫ్టీ 23,638 (-58), 78,102 (-163) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు ఎగిశాయి. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
News February 6, 2025
సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారు.. వలసదారుల ఆవేదన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738815655751_653-normal-WIFI.webp)
US నుంచి INDకు చేరుకున్న వలసదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నంతసేపు చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారని 36 ఏళ్ల జస్పాల్ సింగ్ వాపోయారు. అమృత్సర్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటిని తీసేశారని చెప్పారు. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లున్న ఫొటోలు వైరల్ కాగా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కానీ ఆ ఫొటోలు గ్వాటెమాల వలసదారులవని PIB ఫ్యాక్ట్చెక్ తెలిపింది.
News February 6, 2025
ఘోరం.. విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల లైంగికదాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735443612686_367-normal-WIFI.webp)
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.