News January 17, 2025
సింగపూర్ వెళ్లిన సీఎం.. అటు నుంచే దావోస్కు

ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి TG సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయల్దేరారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం రూ.40వేల కోట్ల పెట్టుబడులు సమీకరించింది.
Similar News
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


