News March 19, 2025

మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

image

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్‌లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

image

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్‌‌స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.