News March 19, 2025
మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి
News November 21, 2025
క్లబ్లుగా మారిన స్కూళ్లు.. అష్నీర్ గ్రోవర్ ఆగ్రహం

ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి <<18336011>>ఆత్మహత్య<<>> కలకలం రేపింది. ఉపాధ్యాయుల అవమానాలు, మానసిక వేధింపులే కారణమని విద్యార్థి తండ్రి ఆరోపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై BharatPe మాజీ MD అష్నీర్ గ్రోవర్ స్పందిస్తూ పెద్ద నగరాల్లో స్కూళ్లలో సీటు రావడం స్టేటస్ సింబల్గా చూస్తున్నారని అన్నారు. దీనివల్ల స్కూళ్లు క్లబ్లుగా మారాయని, యాజమానులు కూడా క్లబ్ ఓనర్లలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.


