News March 20, 2025

వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

image

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.

Similar News

News March 20, 2025

నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్‌ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.

News March 20, 2025

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPL ఫ్యాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.

News March 20, 2025

MF హుస్సేన్ పెయింటింగ్‌కు రూ.118 కోట్లు

image

ఎంఎఫ్ హుస్సేన్ ‘అన్‌టైటిల్డ్(గ్రామ్ యాత్ర)’ పెయింటింగ్‌ను న్యూయార్క్‌లో వేలం వేయగా రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. భారత గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే 13 రకాల చిత్రాలను 14 అడుగుల కాన్వాస్‌లో ఆయన 1954లో చిత్రీకరించారు. భారత చరిత్రలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అమృతా షెర్గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్‌కు 2023లో రూ.61.8 కోట్ల ధర పలికింది.

error: Content is protected !!