News August 22, 2024

కొన్ని వస్తువులపై GST కోతపై చర్చించిన కమిటీ

image

నాలుగు శ్లాబుల విధానమే మేలని జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొన్ని వస్తువుల రేట్లను సవరిస్తే వచ్చే చిక్కులేంటో వివరించాలని ట్యాక్స్ అధికారుల కమిటీకి సూచించింది. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని చర్చించి ఫిట్‌మెంట్ కమిటీకి రెఫర్ చేసింది. ప్రస్తుత 5 శ్లాబులను 4 లేదా 3కు తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది.

Similar News

News April 3, 2026

సేతుపతి-సాయిపల్లవి మూవీ.. జూన్‌లో సెట్స్‌పైకి!

image

విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కించనున్న కొత్త మూవీ షూటింగ్ జూన్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ కానుంది.

News April 3, 2026

మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

image

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News April 3, 2026

హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

image

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.