News December 17, 2024

ఉత్తమ విద్య లభించే దేశాలివే!

image

వరల్డ్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకొని 2024లో ఉత్తమ విద్యను అందిస్తోన్న దేశాల జాబితా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 17,000+ మంది అభిప్రాయాలను సేకరించి దీనిని రూపొందించారు. అనేక అంశాల్లో ప్రజలు తమ అవగాహన ప్రకారం దేశాలకు ర్యాంకులిచ్చారు. ప్రథమ స్థానంలో అమెరికా, రెండో స్థానంలో UK, మూడోస్థానంలో జర్మనీ ఉన్నాయి. ఆ తర్వాత కెనడా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా ఉండగా 42వ స్థానంలో ఇండియా ఉంది.

Similar News

News December 6, 2025

వ్యూహ లక్ష్మి పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలి?

image

శ్రీవారి హృదయస్థానంలో వెలసిన వ్యూహ లక్ష్మి అమ్మవారిని పసుపు ముద్రతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత, తొలగించిన పాత పసుపును భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీవారి ప్రత్యేక సేవల్లో, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ పవిత్ర పసుపు లభిస్తుంది. ఈ ప్రసాదం పొందిన వారికి సిరిసంపదలకు లోటు ఉండదని విశ్వాసం. వ్యూహ లక్ష్మి అమ్మవారికి 3 భుజాల ఉండటం వల్ల త్రిభుజ అని కూడా పిలుస్తారు.

News December 6, 2025

రైళ్లలో వారికి లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

image

రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎంచుకోకున్నా, అందుబాటును బట్టి ఆటోమేటిక్‌గా కింది బెర్తులు వస్తాయని అన్నారు. స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లు చెప్పారు.

News December 6, 2025

ఉద్యోగులకు ఆ హక్కు ఉండాలి.. లోక్‌సభలో బిల్లు

image

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులకు వచ్చే ఆఫీసు కాల్స్‌కు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ‘Right to Disconnect Bill-2025’ను NCP ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. పని వేళల తర్వాత, హాలిడేస్‌లో వర్క్ కాల్స్, ఈమెయిల్స్ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే హక్కు ఉద్యోగులకు ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.