News December 6, 2024

టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత నాదే: సీఎం

image

AP: 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ IT నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని విశాఖ డీప్‌టెక్ సదస్సులో తెలిపారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత తనదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(<>ED<<>>)లో 75 కాంట్రాక్ట్ లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. LLB/LLM ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://enforcementdirectorate.gov.in

News December 28, 2025

ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

image

ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు QRSAM, VL-SRSAM దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినూత్న లేజర్ ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఇవి డ్రోన్లను క్షణాల్లో కూల్చేస్తాయి. ఈ వ్యవస్థతో ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక రక్షణ వలయం ఏర్పడబోతోంది.

News December 28, 2025

ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

image

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.