News December 6, 2024

టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత నాదే: సీఎం

image

AP: 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ IT నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని విశాఖ డీప్‌టెక్ సదస్సులో తెలిపారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత తనదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2026

వామ్మో.. సగం విమానాల్లో లోపాలు

image

గతేడాది కాలంలో తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2025 జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చేపట్టిన ఆడిట్‌లో ఈ నిజాలు బయటపడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.

News March 28, 2026

చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

image

చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన ‘NTR జాతీయ పురస్కారం’తో పాటు వచ్చిన ₹10 లక్షలను ఆయన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి ఈ సాయం అందించారు. శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.

News March 28, 2026

యుద్ధం ఇంకొన్ని వారాలే: అమెరికా

image

పశ్చిమాసియా యుద్ధం కొన్నివారాల్లోనే ముగియనుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ అనుకున్న సమయం కంటే వేగంగానే టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయని, ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలోకి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక చర్యలతోనే శత్రువును దెబ్బకొడతామని వెల్లడించారు.