News December 6, 2024
టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత నాదే: సీఎం

AP: 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ IT నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని విశాఖ డీప్టెక్ సదస్సులో తెలిపారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత తనదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
నేడు బీజేపీలో చేరనున్న నటి ఆమని

TG: నటి ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. TBJP అధ్యక్షుడు రామ్చందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు. అటు మరో సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.
News December 20, 2025
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ‘ముస్తాబు’

AP: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్లు కత్తిరించుకోవాలి. జుట్టు నీట్గా దువ్వుకోవాలి. టాయిలెట్కు వెళ్లొచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారం ‘ముస్తాబు స్టార్స్’ పేర్లు ప్రదర్శిస్తారు.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా?

జున్నులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే ఇందులోని హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గర్భిణికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


