News September 3, 2024

బఫర్ జోన్‌లో ఇళ్లు కట్టడం వల్లే ప్రమాదం!

image

TG: ఖమ్మంలో మున్నేరు నది బఫర్ జోన్‌ను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతోనే చాలా మంది వరదకు ప్రభావితమయ్యారు. గతంలో 36 అడుగుల వరద ప్రవాహం ఉన్నా ఖమ్మం నగరాన్ని తాకలేదు. ఈసారి తక్కువ సమయంలోనే వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చాయి. మరోవైపు చెరువులు, నాలాలను పూడ్చేసి వెంచర్లు వేశారు. దీంతో అవి కుంచించుకుపోయి వరద ప్రవాహం నగరాన్ని ముంచేసింది.

Similar News

News October 30, 2025

SEBIలో 110 పోస్టులు… నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత గలవారు NOV 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: sebi.gov.in

News October 30, 2025

బాహుబలి టికెట్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త!!

image

కొత్త సినిమా టికెట్లు ఉన్నాయంటూ SMలో కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రీమియర్ టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఓ వ్యక్తి(Heisenberg M) ట్వీట్ చేశాడు. ఇది నమ్మి డబ్బులు పంపి మోసపోయామని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఖిలాడి చెప్పిన 9391872952 నంబర్‌కు డబ్బులు పంపిన తర్వాత బ్లాక్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News October 30, 2025

గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

image

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో <<18117184>>తీవ్రంగా<<>> గాయపడటంపై టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమయంలో అభిమానులు మద్దతుగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆసీస్‌తో చివరి వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ గాయపడ్డారు. దీంతో అతడికి ఐసీయూలో చికిత్స అందించారు.