News June 29, 2024
ఇంటర్ ప్రవేశాల గడువు జులై 31 వరకు పొడిగింపు

TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును జులై 31 వరకు అధికారులు పొడిగించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం రేపటితో గడువు ముగియనుండగా, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాసైన విద్యార్థుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు టెన్త్ మార్కుల మెమో, ఆధార్ సమర్పించాలన్నారు.
వెబ్సైట్: acadtsbie.cgg.gov.in
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


