News October 7, 2024
అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు

అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.
Similar News
News December 6, 2025
VZM: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకి చెందిన నలుగురు మృతి చెందారు. రామేశ్వరం వద్ద ఆగి ఉన్న కారును అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ ఢీకొట్టింది. మృతులు దత్తిరాజేరు, గజపతినగరం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శబరిమల నుంచి తిరగివస్తున్నారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


