News May 26, 2024
32కు చేరిన గేమింగ్ జోన్ మృతుల సంఖ్య.. నిందితుల అరెస్ట్

గుజరాత్లోని రాజ్కోట్లో TRP గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని <<13316880>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య 32కు చేరింది. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడంతో DNA టెస్టుల ద్వారా వాటిని కుటుంబీకులకు అప్పగిస్తున్నారు. గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, ఓనర్ యువరాజ్ సోలంకీతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Similar News
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.


