News June 19, 2024
క్రికెట్లో తగ్గిపోతున్న ‘ఫ్యాబ్ 4’ హవా?
క్రికెట్లో ‘ఫ్యాబ్ 4’గా పిలిచే కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, రూట్ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన వీరు ప్రస్తుతం ఓ మాదిరి ప్రదర్శన ఇస్తున్నారు. అలాగే మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా కొనసాగడం లేదు. ప్రస్తుతం వీరిలో ఎవరూ కెప్టెన్సీ కూడా చేయడం లేదు. ఈ నలుగురూ కెప్టెన్సీ చేయకపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి. ఒకప్పటిలా కసిగా పరుగులు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News October 8, 2024
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <
News October 8, 2024
నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.
News October 8, 2024
శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.