News August 5, 2024

ఆ వివరాలు వెల్లడించలేం: రక్షణ శాఖ

image

దేశ‌ సాయుధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు, వాటి భ‌ర్తీకి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను బ‌హిర్గతం చేయ‌డం దేశ భ‌ద్ర‌త‌కు మంచిదికాద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. ఇది సున్నిత‌మైన అంశ‌మని పేర్కొంది. సాయుధ ద‌ళాల్లోని ఖాళీలు, వాటి భ‌ర్తీపై కాంగ్రెస్‌ ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి సంజ‌య్ సేథ్ ఈ మేర‌కు బ‌దులిచ్చారు.

Similar News

News March 17, 2026

బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.

News March 17, 2026

హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలి?

image

పూర్వం తులసీదాసు జైలులో బంధీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా రచంచి, పఠించారు. అప్పుడు వేల వానరాలు రాజభవనంపై దాడి చేశాయి. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అది దైవ సంకల్పమని గ్రహించి, తులసీదాసును విడుదల చేసి క్షమాపణ కోరాడు. కోతులు కూడా శాంతించి అక్కడి నుంచి వెళ్లాయి. తులసీదాసు భక్తి ఆయనను ప్రాణాపాయం నుంచి కాపాడింది. అందుకే మన ఆపదలు తొలగి, ధైర్యం కలగాలంటే రోజూ హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు సూచిస్తారు.

News March 17, 2026

యుద్ధం.. లెబనాన్‌లో 886 మంది మృతి

image

ఇజ్రాయెల్ చేస్తున్న భీకర వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా 886 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 111 మంది చిన్నారులు, 67 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, US దాడుల్లో ఇరాన్‌లో 1500 మందికి పైగా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.