News March 18, 2024

ప్రసన్నుడి బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా..!

image

నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గిరిప్రదక్షిణ, అంకురార్పణతో రేపు ప్రారంభం కానున్నాయి. 20న తిరుమంజనం, ధ్వజారోహణ, శేషవాహన సేవ, 21న హనుమంత సేవ, 22న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడసేవ, 23 ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవం, గజ వాహన సేవ, 24న ఉదయం కల్యాణం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ, 25న సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి.

Similar News

News October 21, 2025

కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.

News October 21, 2025

కందుకూరులో పోలీసులు అతి: YCP

image

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.

News October 21, 2025

VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

image

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.