News March 22, 2024
ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం.. ఇద్దరు సస్పెండ్

AP: ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయడంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏలూరు(D) ఉంగుటూరు మండలం రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్కు పార్టీ రంగులు ఉన్నాయంటూ స్థానికుడు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తెల్లరంగు వేయించారు. అయితే అతడి వివరాలు స్థానిక నాయకులకు చేరవేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో.. కలెక్టర్ స్పందించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Similar News
News April 7, 2025
రూ.4,00,000.. వారం రోజులే గడువు

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని అంచనా. మే 31లోగా అర్హులను స్క్రీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.4 లక్షల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News April 7, 2025
డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: టీపీసీసీ చీఫ్

TG: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరు ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆదేశాలను ధిక్కరించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్తో లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోదండరాంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.
News April 7, 2025
బిల్ గేట్స్ పిల్లలకిచ్చే ఆస్తి ఎంతో తెలుసా?

తన ఆస్తిలో 1శాతం లోపే తన కుటుంబానికి ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ తెలిపారు. వారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ద్వారా కాకుండా స్వతంత్రంగా పైకి రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపాడ్కాస్ట్లో పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను నడపమని వారిని కోరనని, వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించడమే తనకి ఇష్టమన్నారు. బిల్గేట్స్ మెుత్తం సంపద 155బిలియన్ డాలర్లు.