News August 31, 2024
కొత్తగా నిర్మించిన రైల్వేట్రాక్ల దూరం 14,985 KM
దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భారత్ రైళ్లలో 1500 KM దూరానికి కేవలం రూ.450 ఖర్చవుతుందని పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు తక్కువ శబ్దం ఉంటుందని తెలిపారు. ఈటీ వరల్డ్ లీడర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు.
Similar News
News February 1, 2025
రేపు ‘తండేల్’ ప్రీరిలీజ్ వేడుక
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈసారి అసలు గురి తప్పేదే లేదూ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
News February 1, 2025
శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య
భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.
News February 1, 2025
పాత Income Tax పద్ధతికి ఇక గుడ్బై!
కొత్త Income Tax విధానంలో రూ.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా ₹2.5L వరకు 0, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L- ₹5L వరకు 5%, ₹5L- ₹10L వరకు 20%, ₹10L పైన 30% వద్దే ఉంచేశారు. ఇందులో బెనిఫిట్స్ రావాలంటే HRA, హోమ్ లోన్స్, SEC 80C కింద క్లెయిమ్స్ చేసుకోవాలి. లేదంటే రూ.వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సిందే. అందుకే కొత్త ITకే అందరూ మొగ్గు చూపడం ఖాయం.