News August 31, 2024

కొత్తగా నిర్మించిన రైల్వేట్రాక్‌ల దూరం 14,985 KM

image

దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భార‌త్ రైళ్ల‌లో 1500 KM దూరానికి కేవ‌లం రూ.450 ఖ‌ర్చ‌వుతుంద‌ని పేర్కొన్నారు. వందే భార‌త్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు త‌క్కువ శ‌బ్దం ఉంటుంద‌ని తెలిపారు. ఈటీ వ‌ర‌ల్డ్ లీడ‌ర్స్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.

Similar News

News November 21, 2025

సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

image

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్‌లెట్ కూడా అందుతుంది. ఆన్‌లైన్ పేమెంట్‌తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.

News November 21, 2025

24 నుంచి కొత్త కార్యక్రమం

image

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.