News August 31, 2024

కొత్తగా నిర్మించిన రైల్వేట్రాక్‌ల దూరం 14,985 KM

image

దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భార‌త్ రైళ్ల‌లో 1500 KM దూరానికి కేవ‌లం రూ.450 ఖ‌ర్చ‌వుతుంద‌ని పేర్కొన్నారు. వందే భార‌త్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు త‌క్కువ శ‌బ్దం ఉంటుంద‌ని తెలిపారు. ఈటీ వ‌ర‌ల్డ్ లీడ‌ర్స్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.

Similar News

News November 19, 2025

2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

image

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News November 19, 2025

రేపు సీబీఐ కోర్టుకు జగన్

image

AP: అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టుకు ఉదయం 11.30 గంటలకు వస్తారని తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. దీంతో ఈ నెల 21 లోగా వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే వచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం.

News November 19, 2025

మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

image

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>