News August 31, 2024

కొత్తగా నిర్మించిన రైల్వేట్రాక్‌ల దూరం 14,985 KM

image

దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భార‌త్ రైళ్ల‌లో 1500 KM దూరానికి కేవ‌లం రూ.450 ఖ‌ర్చ‌వుతుంద‌ని పేర్కొన్నారు. వందే భార‌త్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు త‌క్కువ శ‌బ్దం ఉంటుంద‌ని తెలిపారు. ఈటీ వ‌ర‌ల్డ్ లీడ‌ర్స్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.

Similar News

News October 22, 2025

రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

image

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.

News October 22, 2025

RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

image

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drrmlims.ac.in/

News October 22, 2025

నిందితుడికి మా పార్టీలో ఏ పదవీ లేదు: TDP

image

AP: కాకినాడ(D) తునిలో స్కూల్ నుంచి బాలికను తోటలోకి తీసుకెళ్లిన <<18071366>>ఘటనపై<<>> టీడీపీ స్పందించింది. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలోనూ నిందితుడికి ఏ పదవీ లేదు. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు’ అని ట్వీట్ చేసింది.