News August 15, 2024
మహనీయుల కలలను సాకారం చేయాలి: మోదీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని PM మోదీ పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాణాలర్పించిన సమరయోధులకు దేశం రుణపడి ఉంది. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యం కోసం 40కోట్ల మంది పోరాడారు. ఇప్పుడు మన జనాభా 140కోట్లు. మనం వారి కలలను సాకారం చేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి’ అని సూచించారు.
Similar News
News October 25, 2025
దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.
News October 25, 2025
ఆ యాప్లను అధిగమించలేము: పర్ప్లెక్సిటీ సీఈవో

యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ను అధిగమించడం అసాధ్యమని ఏఐ సెర్చింజన్ పర్ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్లను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎకో సిస్టమ్ను ఏ స్టార్టప్ దాటలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు ఆయనపై విధంగా బదులిచ్చారు. గూగుల్ సృష్టించిన జెమినీని అధిగమించడం కష్టమేనని పలువురు పేర్కొన్నారు. అరవింద్ కామెంట్స్పై మీరేమంటారు?
News October 25, 2025
అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరి ప్రసాద్ జననం
1968: సినీ నటుడు సంపత్ రాజ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం(ఫొటోలో)
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
* అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం


