News September 24, 2025
రాష్ట్రంలో 2 సెకన్లు కంపించిన భూమి

AP: ఒంగోలులో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటలకు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కంపనాలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. 10kmల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
Similar News
News September 24, 2025
ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.
News September 24, 2025
మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
News September 24, 2025
OCT 3 నుంచి రేషన్ షాపుల బంద్కు నిర్ణయం

TG: కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు. 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 6 నెలల కమీషన్ రూ.120 కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు.