News January 19, 2025

ఆర్థిక పరిస్థితి దుర్భరం.. అయినా పథకాల అమలు: మంత్రి జూపల్లి

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

image

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్‌లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.

News November 18, 2025

పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

image

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్‌లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.

News November 18, 2025

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.