News March 16, 2024

భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 2/2

image

ఈ అరుదైన ఘటనతో 24లక్షల ఏళ్లకు ఓసారి భూ వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయట. ఓ గ్రాండ్ సైకిల్‌లో భూమికి ఎక్కువ సూర్యకాంతి తగులుతూ, తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే మరో సైకిల్‌లో సూర్యకాంతి తగ్గి, శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. భూ అవక్షేపాలపై పరిశోధనతో ఈ విషయాలను కనుగొన్నారు. సముద్ర గర్భాన మార్పులు, గతకొన్నేళ్లలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తమ పరిశోధనకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

Similar News

News November 26, 2025

పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

image

శుభకార్యాలు ప్రారంభించే ముందు పెరుగు, చక్కెర కలిపి తింటారు. ఇలా తింటే అదృష్టం వరిస్తుందన్న నమ్ముతారు. అయితే దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంది. ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, ఫస్ట్ డే ఆఫీస్‌కు వెళ్లినప్పుడు ఎవరికైనా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అయితే పెరుగుకు దేహాన్ని చల్లబరచే సామర్థ్యం, చక్కెరకు తక్షణ శక్తి అందించే లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుంటే టెన్షన్‌ తగ్గి, మనసు శాంతిస్తుంది. అందుకే తినమంటారు.

News November 26, 2025

ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://apgb.bank.in/

News November 26, 2025

‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

image

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.