News July 15, 2024
23 నుంచి ‘పొలం పిలుస్తోంది’

AP: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట పట్టనున్నారు. వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాలవారీగా షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


