News July 15, 2024

23 నుంచి ‘పొలం పిలుస్తోంది’

image

AP: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట పట్టనున్నారు. వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాలవారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు.

Similar News

News December 13, 2025

2వ విడతలో 172 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 182 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172గ్రామ పంచాయతీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.

News December 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 37

image

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 13, 2025

కేరళలోనూ వికసిస్తున్న కమలం!

image

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.