News November 20, 2024
గొడవ YCP వాళ్లతోనే.. అదానీ సంస్థతో కాదు: ఆదినారాయణరెడ్డి

AP: జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి YCP నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని BJP MLA ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన గొడవ YCP వాళ్లతోనేనని, అదానీతో కాదని, ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏర్పాటుకాని అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతున్న దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వెల్లడించారు. YCP కంపెనీలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <
News September 17, 2025
ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానం

*మోదీ గుజరాత్లోని వాద్నగర్లో 1950లో జన్మించారు.
*8 ఏళ్ల వయసులో RSSలో చేరి.. 15 ఏళ్లు వివిధ బాధ్యతలు చేపట్టారు.
*1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
*2001లో శంకర్సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు ముదరడంతో మోదీని CM పదవి వరించింది.
*పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.