News October 25, 2024

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు.. విశేషాలివే!

image

1951, అక్టోబర్ 25.. భారతదేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు. సివిల్ సర్వెంట్ సుకుమార్ సేన్ CECగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా 489 పార్లమెంట్, 4వేల అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 53 రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. 21 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించారు. 17,32,12,343 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ 1952 FEB వరకు కొనసాగింది.

Similar News

News December 3, 2025

హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

image

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 20నే ఫొటోషాప్‌ స్లైడ్స్‌ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్‌ <<>>పాలసీపై KTR ప్రెస్‌మీట్‌ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ‌NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.

News December 3, 2025

సంచార్‌ సాథీ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

image

సంచార్‌ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్‌సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్‌లో అమ్మే ప్రతి ఫోన్‌లో ఆ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.

News December 3, 2025

హనుమాన్ చాలీసా భావం – 28

image

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>