News April 17, 2024

ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 19న 21 రాష్ట్రాల్లోని 102 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తొలి విడతలో అస్సాం, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.

Similar News

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

చదరంగం నేర్పించే జీవిత పాఠం!

image

చదరంగం ఆట లైఫ్‌లో ఛాలెంజెస్‌ను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. చెస్‌లో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడని ఎదురుచూస్తే మనం గెలవలేం. లైఫ్‌లో కూడా అలా వేచి చూడకుండా మీ స్ట్రాటజీతో అవకాశాలను క్రియేట్ చేసుకోండి. 16 పావులూ మన వెంటే ఉన్నా.. ఆఖరి నిమిషంలో మన యుద్ధం మనమే చేయాలి. లైఫ్‌లో కూడా అంతే.. ఇతరులపై డిపెండ్ అవ్వకుండా మీకోసం మీరే పోరాడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన సామర్థ్యమేంటో బయట పడుతుంది.

News November 24, 2025

రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

image

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.