News July 31, 2024

పోలవరం తొలి దశ అంచనా రూ.31,625 కోట్లు

image

AP: పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625 కోట్లని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో తెలిపారు. రూ.30,436 కోట్లు ఖర్చవుతుందని 2023లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసిందని, కేంద్ర జలశక్తి సవరించిన అంచనాల ప్రకారం లెక్కగట్టిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో చాలా హామీల్ని అమలుచేశామని, కొన్నింటి అమలు వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో 18 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/

News October 31, 2025

సెక్స్ కుంభకోణం కేసు.. ప్రిన్స్‌పై కింగ్ చర్యలు

image

జెఫ్రీ ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూపై ఆయన సోదరుడు కింగ్ ఛార్లెస్-3 కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకున్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. USను కుదిపేసిన ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం బాధితురాలు గ్రిఫీ.. ఆండ్రూ తనపై 3సార్లు అత్యాచారం చేశారని ఇటీవల ఆరోపించారు. దీంతో ఆయనపై కింగ్ ఛార్లెస్-3 చర్యలు చేపట్టారు.

News October 31, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.