News July 31, 2024
పోలవరం తొలి దశ అంచనా రూ.31,625 కోట్లు

AP: పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625 కోట్లని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో తెలిపారు. రూ.30,436 కోట్లు ఖర్చవుతుందని 2023లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసిందని, కేంద్ర జలశక్తి సవరించిన అంచనాల ప్రకారం లెక్కగట్టిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో చాలా హామీల్ని అమలుచేశామని, కొన్నింటి అమలు వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
అధికారులు బడి భోజనం చేయాల్సిందే..

TG: స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను సర్కారు సీరియస్గా తీసుకుంది. అలాంటివి జరగకుండా కలెక్టర్ నుంచి స్పెషలాఫీసర్లు, ఇతర అధికారులు హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేయాలని CM ఆదేశించారు. రానున్న ‘99 రోజుల ప్రజాపాలన’ నుంచే దీనిని ఆరంభించాలన్నారు. విద్యా సంవత్సరం మొత్తం అమల్లో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భుజించాలన్నారు.
News March 5, 2026
సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్!

ప్రపంచకప్ గెలవాలనుకున్న సౌతాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది. T20 WC-2026లో సెమీస్లో బోల్తా పడింది. ఈ ఎడిషన్లో ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన SA ఆశలపై న్యూజిలాండ్ <<19299856>>నీళ్లు చల్లింది<<>>. 2024 ఫైనల్లోనూ చివరి దాకా పోరాడి ఇండియా చేతిలో SA ఓడిపోయింది. గతేడాది మహిళల జట్టు ODI WC ఫైనల్లో భారత్ చేతిలోనే పరాజయం పాలైంది. తాజా ఓటమితో సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. better luck next time.
News March 4, 2026
యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఖతర్లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.


