News June 4, 2024
తెలంగాణలో తొలి ఫలితం వచ్చేది అక్కడే!

TGలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో తొలి ఫలితం నేడు మ.ఒంటి గంట కల్లా నిజామాబాద్ సీటులో వెలువడనుంది. ఇక్కడ కేవలం 15రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మరోవైపు కరీంనగర్, నల్గొండ, HYD నియోజకవర్గాల ఫలితాలు చివర్లో(24 రౌండ్లు) వచ్చే అవకాశముంది. ఇక చేవెళ్లలో 23, మల్కాజిగిరిలో 21, SEC 20, ADB 23, PDPL 21, ZHB 23, MDK 23, WGL 18, BNR 23, MHBD 22, KHM 21, MHBR 21, NGKL 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


