News September 29, 2024
ఆ మాజీ మంత్రి తిరిగి క్యాబినెట్లోకి
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ముఖ్యమంత్రి స్టాలిన్ తిరిగి తన క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై 15 నెలలపాటు జైలులో ఉన్న సెంథిల్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఉదయనిధి స్టాలిన్కు DyCMగా ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. అలాగే క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరో ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులు ఆదివారం మధ్నాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Similar News
News September 29, 2024
ఐమ్యాక్స్, జలవిహార్ను కూల్చాలి: దానం నాగేందర్
TG: హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నవి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లు కూలగొట్టాల్సింది. ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 29, 2024
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?
TG: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను వెబ్సైటులో వెల్లడించింది. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఆఫీసులు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ <
News September 29, 2024
కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్గా నారా లోకేశ్
AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.