News August 4, 2024
ఇవాళ ‘నాగార్జున సాగర్’ గేట్లు ఓపెన్

కృష్ణా నది పరివాహకంలో వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటిమట్టం పెరిగింది. సాగర్ నిండేందుకు మరో 60 టీఎంసీలు అవసరం కాగా గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తగా 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద సాగర్కు వస్తోంది.
Similar News
News January 21, 2026
బాపట్ల: పెళ్లికావడంలేదని యువకుడి సూసైడ్

పెళ్లికావడంలేదని జగదీష్ (30) విష గుళికలు తిని మృతి చెందిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు వివరాల మేరకు.. చిలుమూరుకు చెందిన బొంది జగదీష్ పెళ్లి కావడం లేదని మనస్థాపం చెంది సోమవారం విష గుళికలు తిన్నాడు. అతను జీజీ హెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుని తమ్ముడు రాజేష్ ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశామన్నారు.
News January 21, 2026
ఎక్కువ కాలం జీవించాలంటే ఇలా చేయండి!

మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్గా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అతిగా ఆందోళన చెందడం, నెగటివ్ ఆలోచనల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇది త్వరగా రోగాల బారిన పడేలా చేస్తుందని, అందుకే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. SHARE IT
News January 21, 2026
ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.


