News January 2, 2025
తరం మారింది! న్యూఇయర్ వేడుకల తీరూ మారింది!

న్యూఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యూత్ తాగి తూగడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరీ, మథుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను DEC 31, JAN 1న లక్షల్లో సందర్శించడాన్ని ఉదహరిస్తున్నారు. AP, TG లోనూ ఆలయాలు కిటకిటలాడటం తెలిసిందే. ఇంగ్లిష్ ఇయర్ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట!
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


