News September 27, 2025
భద్రకాళి క్షేత్రంలో భువనేశ్వరీ దేవి వైభవం!

ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో నవరాత్రి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఈ శుభదినాన అమ్మవారు భువనేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ జగన్మాతను సేవించడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 4AMకి నిత్యాహ్నికంతో నేటి వేడుకలు ప్రారంభమయ్యాయి. గంధోత్సవం, ధూమ్రహాదుర్గార్చన, సాలభంజిక సేవలు ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తాయి. భక్తులు అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు.
Similar News
News February 8, 2026
వారంలో భారీగా తగ్గిన ధరలు

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ నెల 1-7 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3,980 తగ్గి రూ.1,56,600కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.3,650 తగ్గి రూ.1,43,550గా ఉంది. అటు కేజీ వెండి ధర ఫిబ్రవరి 1న రూ.3.20 లక్షలుగా ఉండగా నిన్నటి వరకు రూ.2.85 లక్షలకు చేరింది. వారంలోనే ఏకంగా రూ.35వేలు తగ్గింది. రాబోయే రోజుల్లో ఇదే పతనం కొనసాగనుందని సమాచారం.
News February 8, 2026
భాను సప్తమి పూజా విధానం

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.
News February 8, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.


