News February 28, 2025
రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.
Similar News
News February 7, 2026
ఏపీలో చిక్కింది.. తెలంగాణలో సెర్చింగ్!

తెలుగు రాష్ట్రాలను కొన్ని రోజులుగా పెద్దపులులు భయపెడుతున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనాలను భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి నిన్న అధికారులకు చిక్కింది. మరోవైపు తెలంగాణ జనగాంలోని రఘునాథపల్లిలో మరో పెద్దపులి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా లేగదూడను చంపిన ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల గూడ్స్.. US నుంచి ఇండియాకు!

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల గూడ్స్ను ఇండియా కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, ఎయిర్క్రాఫ్టులు, వాటి పార్టులు, విలువైన లోహాలు, టెక్నాలజీ ప్రొడక్టులు, కోకింగ్ కోల్ వంటివి ఉన్నాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU)తో పాటు ఇతర టెక్నాలజీ ప్రొడక్టుల వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
News February 7, 2026
IND-US మధ్య కుదిరిన ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్

IND-US మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైనట్టు వైట్హౌస్ ప్రకటించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని ఫ్రేమ్ వర్క్లో పేర్కొంది. US నుంచి ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పింది. అమెరికా దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలను IND సున్నాశాతానికి తగ్గిస్తుందని తెలిపింది.


