News February 28, 2025
రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.
Similar News
News January 7, 2026
WGL: పోలీసుల అదుపులో కేటుగాడు!

నగదును రెండింతలు చేస్తామంటూ బురిడీ కొట్టించిన ఓ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ORR దగ్గరలోని <<18747599>>ఫామ్ హౌజ్లో రూ.55 లక్షల నగదు<<>>ను పూజలు చేసి రెండింతలు చేస్తామంటూ మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు ముంబయిలో ఉన్నట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ, ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
News January 7, 2026
ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


